బీబీనగర్, జూలై4: ప్రజల సహకారంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ బొక్క జైపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నాల్గో రోజు గ్రామ పంచాయతీ ఆవరణలో ఆయన స్థానికులకు మొక్కలను పంపిణీ చేశారు. వీధుల్లో దోమల నివారణకు హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పల్లె ప్రగతిని ప్రవేశపెట్టి గ్రామాల అభివృద్ధ్దికి ఎంతో కృషిచేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ బొక్క వసుమతి, ఉపసర్పంచ్ కందాడి కొండల్రెడ్డి, వార్డు సభ్యులు రాజిరెడ్డి, ఆనంద్, కందాడి బాల్రెడ్డి, పర్వతం శ్రీశైలం, పంచాయతీ కార్యదర్శి మధుసూదన్రెడ్డి, పారిశుధ్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. అదేవిధంగా మండల ప్రత్యేకాధికారి, డీఈవో చైతన్యజైనీ మండలంలోని లక్ష్మీదేవిగూడెం, చిన్నరావులపల్లి గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లో కూల్చివేసిన భవనాలను, పల్లె ప్రగతి పనులను పరి శీలించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్ బక్కన్న బాల మణి, బస్వారెడ్డి, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
ఇంటింటికీ మొక్కల పంపిణీ
పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీడీవో జలేందర్రెడ్డి, మండల ప్రత్యేకాధికారి బాల్సింగ్ అన్నారు. మండలవ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమం జయప్రదంగా సాగుతున్నది. ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించి అక్కడ మొక్కలు నాటారు. అం తర్గత రోడ్ల లెవలింగ్ పనులను చేపట్టారు. ఆదివారం మం డల కేంద్రంలో సర్పంచ్ గోదాసు శిరీషాపృథ్వీరాజ్ ఆధ్వర్యంలో ఇంటింటికీ హారితహారం మొక్కలను పంపిణీ చేశా రు. కార్యక్రమంలో పాల్గొన్న మండల ప్రత్యేకాధికారి, ఎంపీడీవో మాట్లాడుతూ నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించాలని స్థానికులకు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్ లు గుత్తా నర్సింహారెడ్డి, మెట్టు మహేందర్రెడ్డి, పిట్ట కృష్ణారెడ్డి, అప్పం లక్ష్మీనర్సు, అంతటి పద్మారమేశ్, కాటేపల్లి సిద్ధమ్మయాదయ్య, ఉప్పు ప్రకాశ్, ధర్నెరాణి, ఎంపీటీసీలు తిమ్మాపురం మహేందర్రెడ్డి, నర్సిం హ్మ, రేహాన్, గోగు పద్మాసత్తయ్య, పారిజాత, పుష్పావెంకట్రెడ్డి పాల్గొన్నారు.
అడ్డగూడూరు మండలంలో..
మండల పరిధిలోని గోవిందాపురం, దొంగలరేపాక, కోటమర్తి గ్రామాల్లో పల్లె ప్రగతిని ఆదివారం అధికారులు నిర్వహించారు. ఆయా గ్రామా ల్లో ఎంపీడీవో చంద్రమౌళి, మండల ప్రత్యేకాధికారి స్థానికులకు మొక్కలను పంపిణీ చేశారు. పారిశుధ్య, పిచ్చి మొక్కల తొలగిం పు పనులను పర్యవేక్షించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు జోసఫ్, మండల కో-ఆప్షన్ సభ్యుడు అంథోని తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలి
భూదాన్పోచంపల్లి, జూలై4: ప్రతి ఇంట్లో విధిగా మొక్కల ను నాటాలని పోచంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి అన్నారు. ఆదివారం పోచంపల్లి పట్టణంలోని ఐదోవార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వార్డువాసులకు ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమలో మున్సిపల్ కమిషన ర్ ఎన్న సుదర్శన్, మాజీ వార్డు సభ్యురాలు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.