హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): కంటి బ్లాక్ ఫంగస్పై ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అవగాహన కల్పిస్తున్నది. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ సేవలను ప్రారంభించింది. కంటి సంబంధిత బ్లాక్ ఫంగస్ సమస్యలను నివృత్తి చేసుకొనేందుకు 1800 200 2211లో సంప్రదించాలని సూచించింది. ఆదివారం మినహా రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ టోల్ఫ్రీ నంబర్లో నిపుణులు అందుబాటులో ఉంటారని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కాల్ చేసినవారి చిరునామాకు దగ్గరలో చికిత్స పొందేందుకు ఏ దవాఖాన ఉన్నది వంటి సమాచారాన్ని టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసినవారికి తెలియజేస్తున్నామని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అసొసియేట్ డైరెక్టర్ రఘురామ్ తెలిపారు.