ED Summons Maha Minister | మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ఠాక్రేను తాను చెంపదెబ్బ కొడతానని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే చేసిన వ్యాఖ్యలు ఆయన అరెస్ట్కు దారి తీశాయి. ఈ పరిణామం తాజాగా మరో మలుపు తిరిగింది. మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదివారం ఉద్ధవ్ ఠాక్రే క్యాబినెట్ మంత్రి అనిల్ పరబ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మంగళవారం విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ ఆదేశించిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
కేంద్ర మంత్రి నారాయణ్ రాణెను అరెస్ట్ చేసే విషయంలో మహారాష్ట్ర మంత్రి అనిల్ పరబ్ అత్యుత్సాహం ప్రదర్శించినట్లు తెలుస్తున్నది. ఎటువంటి జాప్యం చేయకుండా నారాయణ్ రాణెను అరెస్ట్ చేయాలని ఫోన్లో ఒక పోలీసు ఆఫీసర్తో మాట్లాడుతున్న ఆడియో క్లిప్ లీకైంది. దీనిపై న్యాయ, చట్టపరంగా ఉన్న అన్ని ఆప్షన్లను పరిశీలిస్తామని బీజేపీ పేర్కొంది. ఈ అంశాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రతి ఇంటికి తీసుకెళ్తామని వెల్లడించింది.