తిరువనంతపురం : కేరళలో స్పష్టమైన ఆధిక్యంతో వరుసగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టనున్న ఎల్డీఎఫ్ విజయంపై కేరళ కాంగ్రెస్ చీఫ్ ముళ్లపల్లి రామచంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం అవినీతిలో మునిగితేలిందనేది అందరికీ తెలిసిందేనని అన్నారు.
ప్రస్తుత ముఖ్యమంత్రికి సానుకూలంగా ఎన్నికల్లో ఇంతటి తీర్పు వెల్లడవడాన్ని జాగ్రత్తగా అథ్యయనం చేయాలని వ్యాఖ్యానించారు. అవినీతిలో కూరుకుపోయిన సర్కార్కు ప్రజల నుంచి మద్దతు లభించడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ఇక 140 స్ధానాలున్న కేరళ అసెంబ్లీలో ఎల్డీఎఫ్ 99 స్ధానాల్లో యూడీఎఫ్ 41 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.