బల్లియా : టైర్, పెట్రోల్ ఉపయోగించి మృతదేహాన్ని దహనం చేసినందుకు ఐదుగురు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు విధుల నుండి సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం చోటుచేసుకుంది. మాల్దేపూర్ గ్రామంలోని గంగానది నుండి స్వాధీనం చేసుకున్న ఓ మృతదేహాన్ని టైరు, పెట్రోల్ ఉపయోగించి పోలీసు కానిస్టేబుళ్లు దహనం చేశారు. ఈ వీడియో సోమవారం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయింది. దీంతో జిల్లా ఎస్పీ విపిన్ తడా క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. మనిషి అంత్యక్రియల్లో చూపించాల్సిన కనీసం మానవత్వం మరిచారన్నారు. ఈ విషయమై అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ సంజయ్ యాదవ్ను దర్యాప్తు అధికారిగా నియమించినట్లు తెలిపారు.