ప్రముఖ జాబ్ సైట్ ఇన్డీడ్ వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : కరోనా మహమ్మారితో చితికిపోయిన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో ఉద్యోగ నియామకాల్లోనూ పురోగతి చోటుచేసుకుంటున్నది. భారత్లో 2020 ఫిబ్రవరికి ముందున్న స్థాయిలో ప్రస్తుతం నియమకాలు జరుగుతున్నాయి. పలు రంగాలు తమ కార్యకలాపాలను తిరిగి మొదలుపెట్టడం, లేబర్ మార్కెట్ కోలుకోవడంతో ఉద్యోగాల లభ్యత పెరిగింది. ప్రపంచంలోని 60 దేశాల్లో సేవలు అందిస్తున్న ప్రముఖ జాబ్ సైట్ ‘ఇన్డీడ్’ సోమవారం విడుదల చేసిన రిపోర్ట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. టెక్ ఉద్యోగాలకు ప్రాధాన్యం కొనసాగుతున్నది. పశువైద్యం, చిల్లర వ్యాపారాలు, ఆహార రంగాలకు సంబంధించిన ఉద్యోగాలు చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు.