తొర్రూరు, ఏప్రిల్ 19: కరోనా విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తప్పని సరిగా తీసుకోవాలని డీఎంహెచ్వో శ్రీరామ్ సూచించారు. సోమవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ వ్యాక్సినేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వైద్యుడు మరళీధర్తో వ్యాక్సిన్పై ఆరా తీశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు సమర్థవంతమైనవని, ఏ వ్యాక్సిన్ తీసుకున్నా పనితీరులో మార్పు ఉండదన్నారు. ప్రజల్లో వ్యాక్సిన్లపై అపోహలు తొలగించడానికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికీ 30 నుంచి 40 శాతం మంది వ్యాక్సిన్లు తీసుకోవడానికి ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. ఏ వ్యాక్సిన్ తీసుకోవాలని చాలా మంది అడుతున్నట్లు పేర్కొన్నారు. రెండో డోసు పూర్తయిన 15 రోజుల తర్వాత పూ ర్తిస్థాయిలో యాంటిబాడీస్లు వృద్ధి చెందుతున్నట్లు వి వరించారు. మరో రెండు ప్రైవేట్ కేంద్రాల్లో స్వల్ప రుసుం తో వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతుందన్నారు. జిల్లా కొవిడ్ నియంత్రణ అధికారి డాక్టర్ రాజేశ్, మండల వైద్యాధికారి దిలీప్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
కొవిడ్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పెద్దవంగర: కొవిడ్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో శ్రీరామ్ పేర్కొన్నారు. సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కరోనా వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటుకు ఆమోదం రావడంతో ఎంపీపీ ఈదురు రాజేశ్వరి, జడ్పీటీసీ శ్రీరాం జ్యోతిర్మయి కేం ద్రాన్ని ప్రారంభిచగా, శ్రీరామ్ వ్యాక్సిన్ కేం ద్రాన్ని పరిశీలించారు. 45 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. కరోనా రోజురోజుకూ విజృంభి స్తున్నందున ప్రతి ఒక్క రూ విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక ధూరం పాటించాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్వో మురళీధర్, తహసీల్దార్ యోగేశ్వర్రావు, డాక్టర్లు దిలీప్, వేదకిరణ్, ఎంపీవో యాకయ్య, ఎంపీటీసీల ఫోరం మం డల అధ్యక్షుడు శ్రీనివాస్, పాలకుర్తి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్యశర్మ, నాయకులు సుధీర్కుమార్, సంజయ్, రాము, లింగమూర్తి, శ్రీనివాస్, సమ్మయ్య, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.
కరోనాపై అప్రమత్తంగా ఉండాలి..
చిన్నగూడూరు: కరోనాపై మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైస్ ఎంపీపీ పిల్లి వీరన్న, పీహెచ్సీ వైద్యుడు రవికుమార్ తెలిపారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో సోమవారం మండల కేంద్రంతో పాటు ఉగ్గంపల్లిలో కరోనా నియంత్రణపై అవగాహన కల్పించారు. అనంతరం వైద్య సిబ్బంది కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఉన్నారు.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
దంతాలపల్లి: కరోనాపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని దంతాలపల్లి ప్రభుత్వ దవాఖాన వైద్యాధికారి సతీశ్కుమార్ సూచించారు. సోమవారం దంతాలపల్లి పీహెచ్సీలో 120 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు.