టెలి కన్సల్టేషన్కు అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తూ అర్హత కలిగిన ఉద్యోగులు ఎవరైనా మెడికల్ ప్రాక్టీసు చేసుకోవచ్చునని కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలకు సేవలందించేందుకు ముందుకురావాలని కోరింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది శిక్షణ మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. అర్హత కలిగిన ఉద్యోగులు ఎవరైనా తమకు ఖాళీ దొరికిన సమయాల్లో ఈ పని చేయవచ్చునని సూచించింది. దీనికింద కేంద్ర ఉద్యోగులు టెలీ కన్సల్టేషన్ ద్వారా చికిత్స అందించవచ్చు.