బీజేపీలోకి 11 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు

కోల్కతా: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్కు రాజీనామా చేసిన కీలక నేత సువేందు అధికారి.. తాను పోవడమేగాక తనతోపాటు మరో 10 టీఎంసీ ఎమ్మెల్యేలను వెంట తీసుకెళ్లాడు. సువేందు వెంట మహా అయితే మరో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు వెళ్తారని తృణమూల్ ముందుగానే ఊహించింది. అయితే వారి అంచనాలకు మించి ఇప్పుడు ఏకంగా 11 మంది (సువేందుతో కలిపి) టీఎంసీని వీడి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఇవాళ అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన బెంగాల్ ఎమ్మెల్యేల్లో సువేందు అధికారి, తాపసి మొండల్, అశోక్ దిండా, సుదీప్ ముఖర్జి, సైకత్ పంజా, షిభద్ర దత్త, దీపాలి బిశ్వాస్, సుక్రా ముండా, శ్యామప్ద ముఖర్జి, విశ్వజిత్ కుందు, బనశ్రీ మైతీ ఉన్నారు. వారితోపాటు పర్బ బుర్ద్వాన్ నియోజకవర్గ ఎంపీ సునీల్ మొండల్, మాజీ ఎంపీ దశరథ్ టిర్కీ కూడా అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు.
ఇవి కూడా చదవండి..
బీజేపీలో చేరిన సువేందు అధికారి
రైతు ఇంట్లో అమిత్ షా, బీజేపీ నేతల భోజనం
దుకాణంలో అగ్నిప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
గుండెపోటుతో శివసేన సీనియర్ నేత మృతి
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- భార్యను చంపిన కేసులో ఏడేండ్ల జైలు
- బైకులు ఢీకొని ఒగ్గు కళాకారులు దుర్మరణం
- రాష్ట్రంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
- చదువుకోక టీవీ చూస్తున్నాడని నిప్పంటించాడు
- కూలీలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 13 మంది మృతి
- రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ
- మేడారం మినీ జాతరకు ప్రత్యేక బస్సులు
- అంగన్వాడీల సేవలు మరింత విస్తరణ
- దేశంలోనే తెలంగాణ పోలీస్ అగ్రగామి
- శుభ్మన్ గిల్ అర్ధ సెంచరీ.. భారత్ 70/1