సిటీబ్యూరో, జూన్ 2 ( నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని ఆటో, క్యాబ్ డ్రైవర్లు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని జేటీసీ పాండురంగనాయక్ తెలిపారు. బుధవారం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు. అందుకు సంబంధించి 10 కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వ్యాక్సిన్ కోసం https://tgtransport. net/TGCFSTONLINE/OnlineTransactions/VaccineRegistrationNew.aspxలో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్, అధార్కార్డు, ఆర్సీ పత్రాలను వ్యాక్సినేషన్ కేంద్రానికి తీసుకువెళ్లాలని తెలిపారు.