మహోబా: ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన జరిగింది. మహోబా జిల్లాలోని కబ్రాయ్ పట్టణంలో ఓ 45 ఏండ్ల వ్యక్తి 65 ఏండ్ల వృద్ధురాలి కాళ్లు, చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం కట్లు విప్పకుండా పారిపోయాడు. స్థానికులు అచేతనావస్థలో ఉన్న వృద్ధురాలిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. వృద్దురాలు కాళ్లు, చేతులకు ఉన్న కట్లను విప్పేశారు. అనంతరం వృద్ధురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఆ తర్వాత ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వృద్ధురాలిని ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె ఇచ్చిన సమాచారం అధారంగా నిందితుడు భరత్ కుశ్వాహ (45)గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఇండియన్ పీనల్ కోడ్లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.