న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 138 తగ్గి రూ.44,113కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.44,251 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గడమే ఇవాళ దేశం పసిడి ధర స్వల్పంగా తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
అదేవిధంగా వెండి ధరలు కూడా ఇవాళ స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.320 తగ్గి రూ.63,212కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర 63,532 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,698 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 24.49 అమెరికన్ డాలర్లు పలికింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
భర్త పుట్టింటికి తీసుకెళ్లలేదని పసిబిడ్డను పొడిచి చంపిన మహిళ..!
రన్నింగ్ బస్సులోంచి వాంతులు.. లారీ ఢీకొట్టడంతో తెగిపోయిన బాలిక తల..!
ఓట్ల కోసం వరి నాటు వేస్తూ మంత్రి వినూత్న ప్రచారం..!
మోదీ సభకు వెళ్తుండగా ప్రమాదం.. తమిళనాడు స్పీకర్కు గాయాలు
ఆ ఆరు రాష్ట్రాల్లోనే అధికంగా కొత్త కేసులు: కేంద్రం
పున్నమి చంద్రుడే ఆ నౌకను కదిలించాడు.. !