మహబూబ్నగర్ :
హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణిదేవికి అన్ని వర్గాల నుంచి విశేషణ ఆధరణ లభిస్తున్నది. ఉద్యోగులు, పట్టభద్రులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ మద్దతను ప్రకటిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్ వారు జిల్లాలోని ఖిల్లా ఘనపూర్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కలిసి తమ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ వెంకటేశం, అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చక్రధర్, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ వివిధ విభాగాల ఇంజినీర్లు ఉన్నారు.