ముంబై: వందేండ్ల వృద్ధ దంపతులు కరోనాపై విజయం సాధించారు. మహమ్మారి నుంచి పది రోజుల్లోనే కోలుకుకున్నారు. మహారాష్ట్రలోని లాతుర్లో ఈ ఘటన జరిగింది. 105 ఏండ్ల భర్త, 95 ఏండ్ల భార్యకు కరోనా సోకింది. ఈ వృద్ధ దంపతులు లాతూర్లోని విలాస్రావ్ దేశ్ముఖ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందారు. డాక్టర్లు వారిద్దరిని పది రోజుల పాటు ఆక్సిజన్ వ్యవస్థపై ఉంచి వైద్యం అందించారు. యాంటీ వైరల్ మందులు కూడా ఇచ్చారు. దీంతో ఆ వృద్ధ దంపతులు కరోనాను ఓడించి కోలుకున్నారని డాక్టర్లు తెలిపారు. వైరస్ గురించి భయం వీడితే మహమ్మారి నుంచి కోలుకోవచ్చన్నదానికి ఈ వృద్ధ జంటే ఉదాహరణ అని వెల్లడించారు.