డబ్బులతో నాయకుల్ని కొనాలని చూస్తుండు
హుజూరాబాద్లో ఎగిరేది గులాబీ జెండాయే
టీఆర్ఎస్ యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖాళీక్ హుస్సేన్, నియోజకవర్గ ఇన్చార్జి శివకృష్ణ
హుజూరాబాద్టౌన్, జూన్20: మాజీ మంత్రి ఈటల రాజేందర్ది నీచమైన సంస్కారమని, డబ్బులు ఇచ్చైనా టీఆర్ఎస్ యువతను తన వెంట తిప్పుకోవాలని చూస్తున్నాడని టీఆర్ఎస్ యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఖాళీక్ హుస్సేన్, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి తొగరు శివకృష్ణ స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ఇపుడు ఈటల రాజేందర్ సమక్షంలో పార్టీలో చేరుతున్నది టీఆర్ఎస్వీ, టీఆర్ఎస్వై నాయకులు కాదని, వాళ్లంతా ఆయన ఆనుచరగణమేనని స్పష్టం చేశారు. బీజేపీ కండువా కప్పుకుందామంటే ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరకని ఈటలకు మా పార్టీని విమర్శించే హకు లేదని, నీవు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా హుజూరాబాద్ గడ్డ మీద ఎగిరేది గులాబీ జెండానే అని, ఇంకోసారి తప్పుడు ఆరోపణలు చేస్తే సహించమని హెచ్చరించారు. విద్యార్థులు, యువతను తప్పుదోవ పట్టించేందుకు ఈటల ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. అసలు మీ ఎజెండా ఏంటో ప్రజలకు వివరించాలని, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ బీజేపీ అని దుయ్యబట్టారు. హుజూరాబాద్ను పీవీ జిల్లా చేయాలని అప్పుడు అఖిలపక్ష నాయకులు ధర్నా చేస్తే నీతి, జాతిలేని ఉద్యమం అని విమర్శించిన ఈటల, ఇపుడు అదే మాట ఆయన మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ యూత్ జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు బొమ్మవేని రాకేశ్ మాట్లాడుతూ గత 20ఏండ్లుగా యువతకు ఏ ఒక పని కూడా చేయని ఈటలకు నిరుద్యోగ యువత గురించి మాట్లాడే హకు లేదన్నారు. స్వార్థ పూరితంగా అబద్ధపు మాటలు మాట్లాడితే నిన్ను హుజూరాబాద్ నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వమని హెచ్చరించారు. ఇక్కడ టీఆర్ఎస్ యూత్ సీనియర్ నాయకులు ఉప్పు శ్రీనివాస్, నియోజకవర్గ నాయకులు కన్నెబోయిన నాగరాజు, యూత్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మంద కళ్యాణ్, గుళ్లి రమేశ్, కార్యదర్శులు అంబాల రవికాంత్, దాసరపు సాగర్, యూత్ నాయకులు ఎండీ హాబీబ్, ఇప్పలపల్లి చంద్రశేఖర్, ఎగ్గొజు ప్రసాద్, కిరణ్, హర్ష కుమార్, నిమ్మల రంజిత్, బోయిని మధు, గుళ్లి సురేష్ ఉన్నారు.