హఫీజ్పేట్, జూలై8: ప్రజారోగ్యం దృష్ట్యా పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని అందుకు పట్టణప్రగతి కార్యక్రమంలో ప్రాధాన్యతనిస్తున్నామని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని మైత్రినగర్2,3, ఉషోదయ ఎన్క్లేవ్లో కార్పొరేటర్లు పూజితగౌడ్, జగదీశ్వర్గౌడ్, చందానగర్ ఉపకమిషనర్ నందగిరి సుధాంశ్, జలమండలి జీఎం రాజశేఖర్ సహా ఆయావిభాగాల అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులను ఆదేశిస్తున్నామన్నారు.
అదేవిధంగా కాలనీ, బస్తీలలో చెత్త కుప్పలు తొలగింపు, వరదనీటి కాల్వల శుభ్రం, దోమల నివారణ చర్యలు, మంజీరా పైపులైన్ లీకేజీలు, డ్రైనేజీ తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అధికారులు ఈఈ శ్రీకాంతిని, హెల్త్ఆఫీసర్ కార్తీక్, డీఈ సురేశ్, జలమండలి డీజీఎం నాగప్రియ, ఏఈ ధీరజ్, ట్రాన్స్కో ఏఈ ఖాద్రి, శానిటేషన్ ఎస్ఎస్ శ్రీనివాస్, ఎస్ఆర్పీ మహేష్, ఎంటమాలజీ సిబ్బంది, హెచ్ఐజీ కాలనీ అధ్యక్షుడు టీ. నాగేశ్వరరావు, మైత్రినగర్ 2,3 అధ్యక్షులు సుబ్బారెడ్డి, దయానందరెడ్డి, పూర్ణచందర్రావు, నర్సింహ, డి.నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, కంది వెంకటేశ్వర్రెడ్డి, విమల, దేవి, సాయిజ్యోతి తదితరులు పాల్గొన్నారు.
మాదాపూర్, జూలై 8: కాలనీలు, బస్తీల్లో సమస్యలను పరిశీలించి సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే, విప్ గాంధీ పేర్కొన్నారు. గురువారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యానగర్ కాలనీ, సుభాష్చంద్రబోస్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో కార్పొరేటర్ వి. జగదీశ్వర్గౌడ్, చందానగర్ సర్కిల్ ఉప కమిషనర్ సుధాంశ్, జలమండలి జనరల్ మేనేజర్ రాజశేఖర్తో పాటు జీహెచ్ఎంసీ ఈఈ శ్రీకాంతినిలతో కలిసి కాలనీల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతలో ప్రతి ఒకరు భాగస్వాములు కావాలని అన్నారు. చందానగర్ సర్కిల్ పరిధిలోని కాలనీలు అన్నింటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డివిజన్లను అందరి సమిష్టి కృషితో అభివృద్ధి పరచాలన్నారు. అనంతరం కార్పొరేటర్ వి. జగదీశ్వర్గౌడ్ మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒకరు బాధ్యత తీసుకోవాలన్నారు. ఖాళీ ప్రదేశాల్లో చెత్తను వేయకుండా పిచ్చి మొక్కలు పెరగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ రూపాదేవి, ఏఈ ప్రశాంత్, జలమండలి డీజీఎం నారాయణ, మేనేజర్ నివర్థి, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సాంబశివరావు, వార్డు సభ్యుడు రహీం, ఆదిత్యానగర్ టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షుడు ఖాసీం, కృష్ణ కాలనీ అధ్యక్షుడు కృష్ణ యాదవ్, రమేశ్రెడ్డి, అంకారావు, తదితరులు పాల్గొన్నారు.