న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో యాంటీ వైరల్ ఇంజెక్షన్ రెమ్డెసివిర్కు బాగా డిమాండ్ పెరిగింది. తగినంత సంఖ్యలో లభ్యం కాకపోవడంతో కొందరు వీటిని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఢిల్లీలో రెమ్డెసివిర్ను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్కో ఇంజక్షన్ను రూ.40,000కు విక్రయిస్తున్నట్లు చెప్పారు. వారి నుంచి రూ.1,20,000 నగదు, మూడు రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 100 ఆక్సిమీటర్లు, 48 చిన్న పరిమాణ ఆక్సిజన్ సిలిండర్లను కూడా వారి కారులో లభించాయి. ఈ నేపథ్యంలో బ్లాక్ మార్కెటింగ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.