హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ ): కరోనా మహమ్మారి విద్యారంగాన్ని దారుణంగా దెబ్బతీసింది. ముఖ్యంగా ఉన్నత చదువులు అటకెక్కాయి. ఊహకందని విధంగా అభ్యసన నష్టం జరిగింది. మనదేశంలో అభ్యసన నష్టం 40-60 శాతం ఉన్నట్టు టీమ్లీజ్ ఎడ్టెక్ సంస్థ అంచనావేసింది. ఉన్నతవిద్యను కరోనా దారుణంగా దెబ్బతీసిందని, జీ7 దేశాలతో పొల్చితే భారత్లోనే అధికంగా అభ్యసన నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఈ నష్టాన్ని పూడ్చేందుకు మూడేండ్లు పడుతుందని అభిప్రాయపడింది. ‘కొవిడ్-19 లెర్నింగ్ లాస్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్’ పేరుతో టీమ్లీజ్ ఎడ్టెక్ సంస్థ ఓ నివేదికను ప్రచురించింది. దేశంలో కరోనా కారణంగా ఊపందుకొన్న ఆన్లైన్ విద్య కొందరికి కాసులు కురిపిస్తున్నదని తెలిపింది. 2016లో 1.6 మిలియన్లు ఉన్న ఆన్లైన్ ఎడ్యుకేషన్ యూజర్లు, 2021 నాటికి 9.6 మిలియన్లకు చేరారని వెల్లడించింది. ఆన్లైన్ విద్యా మార్కెట్ ఈ ఏడాదికి రూ.14,836 కోట్లకు చేరుకుంటుందని అంచనావేసింది. 2016లో ఈ మార్కెట్ విలువ 1,870 కోట్లు ఉండగా, దాదాపుగా 8 రెట్లు పెరిగినట్టు తెలిపింది.
నివేదికలోని ముఖ్యాంశాలు..