ఆయన సేవలు సదా అనుసరణీయం: సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): దేశ మాజీ ఉపప్రధాని, కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు, బలహీన వర్గాల నేత డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ ఆదర్శాలు సదా అనుసరణీయమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. సోమవారం (ఏప్రిల్ 5) బాబూ జగ్జీవన్రామ్ 114వ జయంతి. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను సీఎం కేసీఆర్ ఆదివారం గుర్తుచేసుకున్నారు. దేశ స్వాతంత్య్రం కోసం, సామాజిక సమానత్వం కోసం జగ్జీవన్రామ్ ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేశారని కొనియాడారు.
జగ్జీవన్రామ్ ఆశయాల సాకార వేదిక తెలంగాణ
సీఎం కేసీఆర్ తెలంగాణను బాబూ జగ్జీవన్రామ్ ఆశయాల సాకార వేదికగా తీర్చిదిద్దుతున్నారని రాష్ట్ర షెల్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం జగ్జీవన్రామ్ సేవలను ఆదర్శంగా తీసుకొని అన్నివర్గాల సంక్షేమం, సముద్ధరణ కోసం చిత్తశుద్ధితో కృషిచేస్తున్నదని తెలిపారు. ఎస్సీల అభివృద్ధికి ప్రస్తుత బడ్జెట్లో రూ.21,307 కోట్లు కేటాయించామని గుర్తుచేశారు. రూ.1,000 కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ను ప్రవేశపెట్టామని వెల్లడించారు.
ఇవీ కూడా చదవండి…
కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలి : మంత్రి ఈటల
కర్ఫ్యూ, లాక్డౌన్కు అవకాశం లేదు