కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్లో కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించిన ఘటన చోటుచేసుకున్న కూచ్బెహర్ జిల్లా సితాల్కుచ్చిలో సీఎం మమతా బెనర్జీ బుధవారం పర్యటించారు. మృతుల కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించిన అనంతరం ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ బాధిత కుటుంబ సభ్యులతో తాను మాట్లాడానని ఇప్పుడు వారంతా తన సొంత కుటుంబ సభ్యులేనని అన్నారు.
ఈ ఘటనకు కారకులను విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. బుల్లెట్స్కు తాను బ్యాలెట్లతోనే బదులిస్తానని దీదీ వ్యాఖ్యానించారు.కూచ్బెహర్ హింసాకాండపై పాలక తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలు పరస్పర ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇక ఏప్రిల్ 11నే దీదీ కూచ్బెహర్ జిల్లాను సందర్శించి మృతుల కుటుంబసభ్యులను కలవాల్సి ఉండగా 72 గంటల వరకూ జిల్లాలో బయటి నుంచి వచ్చే రాజకీయ నేతల పర్యటనలపై ఈసీ నిషేధం విధించడంతో ఆమె పర్యటన వాయిదా పడింది.