చండీగఢ్ : హర్యానాలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ను పొడగిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోం, ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ఈ నెల 17 వరకు లాక్డౌన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. హర్యానాలో ఆదివారం కరోనాతో 151 మంది మరణించగా.. మొత్తం మరణాలు 5,506కు పెరిగాయి. కొత్తగా 13,548 కరోనా కేసులు నమోదవగా.. మొత్తం 6,15,897కు చేరాయి. పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నెల 3న లాక్డౌన్ ప్రకటించింది. అయినా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ను పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.