న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పెగాసస్ ప్రకంపనలు కుదిపేస్తున్నాయి. పెగాసస్ స్పైవేర్తో మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టిన మరి కొందరి పేర్లను ది వైర్ సోమవారం విడుదల చేసింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) మాజీ డైరెక్టర్ జనరల్ కేకే శర్మ, సీనియర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారి రాజేశ్వర్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాజీ సహాయకుడు వీకే జైన్, రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (రా) రిటైర్డ్ అధికారి, ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) జూనియర్ అధికారి, ఇద్దరు మాజీ ఆర్మీ ఆఫీసర్లు కల్నల్ ముకుల్ దేవ్ (రిటైర్డ్), కల్నల్ అమిత్ కుమార్ (రిటైర్డ్)తోపాటు మరికొందరిని పెగసాస్ నిఘా సాఫ్ట్వేర్ ద్వారా నిఘా కోసం లక్ష్యంగా చేసుకున్నారని ది వైర్ సోమవారం నివేదించింది. పెగాసస్ నిఘా సాఫ్ట్వేర్ను తయారు చేసి ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ క్లయింట్లు, ఏజెన్సీల ద్వారా నిఘాపెట్టిన 50,000 ఫోన్ నంబర్ల డేటాబేస్లోనే పైన పేర్కొన్న వారు ఉన్నట్లు తెలిపింది.