ముంబై : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. అజిత్ పవార్, ఆయన భార్యకు చెందినదిగా భావిస్తున్న రూ.65 కోట్ల విలువైన ఒక షుగర్ మిల్ను ఈడీ జప్తు చేసింది. మహారాష్ట్ర రాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకు కుంభకోణంకు సంబంధించి ఈ ఆస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ తెలిపింది.