అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,925 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ శనివారం తెలిపింది. 95,366 టెస్టులు నిర్వహించగా.. ఈ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. వైరస్ ప్రభావంతో కొత్తగా 26 మంది మరణించారు. 24 గంటల్లో 3,937 మంది బాధితులు కొలుకొని ఇండ్లకు వెళ్లారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29,262 యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19,20,178కు చేరింది. ఇందులో 18,77,930 మంది కోలుకున్నారని, వైరస్ ప్రభావంతో మొత్తం 12,986 మంది మృత్యువాతపడ్డారని చెప్పింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,28,94,611 టెస్టులు నిర్వహించినట్లు వివరించింది.