మహబూబ్నగర్ : జిల్లాలోని ఎనుగొండలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మిట్టే నరసింహులు(40) అనే వ్యక్తిని కొందరు రాయితో కొట్టి దారుణంగా హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడుని ఓ హత్య కేసులో నిందితుడిగా గుర్తించారు. ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు. దాయాదులే హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.