సంగారెడ్డి జిల్లాలో ఎనిమిది నిర్మాణానికి ప్రభుత్వ నిర్ణయం
మంత్రి హరీశ్రావు ఆదేశాలతో భూ సేకరణకు కసరత్తులు
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు
ఇకపై ఒకేచోట కూరగాయలు, పండ్లు, మాంసం విక్రయాలు
సంగారెడ్డి మార్చి 26 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల్లో కూరగాయలు, మాం సం, పండ్ల మార్కెట్లు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. దీంతో కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్ల రోడ్డుపక్కన దుమ్మూ ధూళి ఉన్నచోట కూరగాయలు, మాంసం, చేపలను విక్రయించడంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. రైతులు కూరగాయలను ఎండలోనే అమ్ముకోవాల్సి వస్తోంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపాలిటీల్లో సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు సొం త నియోజకవర్గాలు గజ్వేల్, సిద్దిపేటలో సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్లను సకల సౌకర్యాలతో నిర్మించారు. అక్కడి తరహాలోనే సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల్లో సైతం సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ప్రజలకు ఉపయోగపడేలా సంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మించాలని మంత్రి హరీశ్రావు తలపెట్టి సమీకృత మార్కెట్ (వెజ్, నాన్వెజ్)ల నిర్మాణం పనులపై జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో ఆరు మాసాల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట, అందోలు, ఆమీన్పూర్, బొల్లారం, నారాయణఖేడ్, తెల్లాపూర్, జహీరాబాద్లో సమీకృత మార్కెట్ల నిర్మాణంపై కసరత్తు ప్రారంభించారు.
మార్కెట్లో సకల సౌకర్యాలు
సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీ, రైతుబజార్లలో కూరగాయల విక్రయాలు జరుగుతున్నప్పటికీ ప్రజల అవసరాలు తీరడంలేదు. పట్టణాల్లో రైతుబజార్తోపా టు ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో రైతులు రోడ్లపక్కనే కూరగాయలు, మాంసం, పూలు అమ్మడం తో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనిని దృష్టి లో ఉంచుకుని ప్రభుత్వం ఒకేచోట కూరగాయలు, మాంసం, పండ్లు లభించేలా సమీకృత మార్కెట్లు నిర్మించనుంది. జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్లు నిర్మించనున్నారు. మార్కెట్లో కూరగాయలు, మాంసం అమ్మకాలకు వేర్వేరుగా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. రూ.2నుంచి 3కోట్ల అంచనా వ్యయంతో ఒక్కో మున్సిపాలిటీల్లో ఒక్కో సమీకృత మార్కెట్ నిర్మించనున్నారు. ఒక్కో సమీకృత మార్కెట్లో 80నుంచి 106స్టాళ్లు ఉంటాయి. కూరగాయలకు 40 స్టాళ్లు, మాంసం, చేపల అమ్మకాలకు 40 స్టాళ్లు, మిగతా స్టాళ్లు పండ్లు, కూరగాయల అమ్మకాలకు నిర్మిస్తారు. పార్కింగ్ సదుపాయం, లోడింగ్ అన్ లోడింగ్, ప్లాట్ఫారమ్లు, టాయిలెట్లు నిర్మిస్తారు. నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరా జరిగేలా ఏర్పాటు చేపడతారు. నీటి సమస్య తలెత్తకుండా వాటర్ ప్లాంట్లతోపాటు రైతులు విశ్రాంతి తీసుకునేందుకు గదులను ఏర్పాటు చేస్తారు.
సిద్ధమవుతున్న ప్రతిపాదనలు
మార్కెట్ల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో రెండు ఎకరాల్లో సమీకృత మార్కెట్లను నిర్మించనున్నారు. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో సమీకృత మార్కెట్ నిర్మాణానికి స్థలం గుర్తించారు. తెల్లాపూర్, బొల్లారంలో స్థలం గుర్తించగా హెచ్ఎండీఏ అనుమతితో త్వరలో నిర్మాణం పనులు ప్రారంభించనున్నారు. అమీన్పూర్, నారాయణఖేడ్, జహీరాబాద్ మున్సిపాలిటీల్లో స్థలం గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. అందోలు-జోగిపేటలో ఇది వరకే వెజ్మార్కెట్ నిర్మాణం పూర్తి చేశారు. పక్కనే నాన్వెజ్ మార్కెట్ నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది.