శ్రీనగర్: కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో భూకంపం వచ్చింది. లడఖ్లోని లేహ్లో సోమవారం ఉదయం 6.10 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. భూఅంతర్భాగంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని తెలిపింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్పారు.