డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో భారీ వర్షం కురిసింది. ఉత్తరాశి, రుద్రప్రయాగ్ జిల్లాల్లో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఎత్తైన ప్రాంతాల నుంచి వర్షం నీరు రావడంతో చాలా ప్రాంతాల్లోని ఇండ్లు బురదలో కూరుకుపోయాయి. ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో నిమగ్నమై ఉన్నది.
ఉత్తరాఖండ్లోని ఉత్తర్కాశిలో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. చినియలిసౌర్ బ్లాక్లోని కుమారారా గ్రామంలో కాలువ నీరు పొంగి ఇళ్లలోకి ప్రవేశించింది. నీటితో వచ్చిన బురదలో ఇండ్లు కూరుకుపోయాయి. అటు రుద్రప్రయాగ్ జిల్లాలోని నరకోటలో భారీ వర్షాలకు ఇండ్లు తుడిచిపెట్టుకుపోయాయి. గ్రామస్థులు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. సర్వం కోల్పోయి ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. గంటల కొద్ది ఎత్తైన ప్రాంతంలో ఉండి ప్రాణాలు దక్కించుకున్నారు. దాదాపు గంట పాటు భారీ వర్షం కురియడంతో ఇండ్లు కూలిపోయాయని ఉత్తరకాశి జిల్లా విపత్తు నిర్వహణ అధికారి దేవేంద్ర పట్వాల్ తెలిపారు.
మరోవైపు, తెహ్రీలోని అనేక ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. గత 4 రోజులుగా ఉత్తరాఖండ్లో వాతావరణం ఘోరంగా ఉన్నది. రెండు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన సమాచారం తెల్సుకున్న ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్.. ఉత్తరకాశి, రుద్రప్రయాగ్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు.బాధిత ప్రజలకు తక్షణ ఉపశమనం కోసం చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
తొలి మహిళా న్యాయమూర్తి అన్నా చాందీ.. చరిత్రలో ఈరోజు
భారత్కు వినోద్ ఖోస్లా 10 మిలియన్ డాలర్ల సాయం
పంచాయతీ విజయం చూడకముందే ముగ్గుర్ని కాటేసిన కరోనా
లాక్డౌన్ విధించండి.. క్యాట్ సర్వేలో ప్రజలు
ఈ నెల 10 న విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్న కేపీ ఒలి
గ్లేసియర్స్ కరిగి ఏర్పడిన వేలాది సరస్సులు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఆన్లైన్లో 60 మంది వైద్యులు.. వివిధ భాషల్లో సేవలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..