గువాహటి: అసోంలో మరోమారు భూకంపం సంభవించింది. రాజధాని గువాహటి సమీపంలోని సోనిట్పూర్లో ఆదివారం మధ్యాహ్నం 2.23 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదయ్యింది. భూకంప కేంద్రం సోనిట్పూర్ జిల్లాలో ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. భూ అంతర్భాగంలో 16 కి.మీ. లోతులు భూమిలో కదలికలు వచ్చాయని తెలిపింది. గత నెలలో కూడా సోనిట్పూర్లో భూకంపం వచ్చింది. అదేవిధంగా తేజ్పూర్, బ్రహ్మపుత్ర నది పరిసరాల్లో మొత్తం 25 సార్లు భూమి కంపించిందని వెల్లడించింది.