ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 40,956 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్ వల్ల మరో 793 మంది మరణించారు. ఒక్క రోజే 71,966 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క ముంబైలోనే 1717 మందికి కొత్తగా వైరస్ సోకింది. 51 మంది ప్రాణాలు కోల్పోగా 6082 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 51,79,929కు చేరింది. ప్రస్తుతం 5,58,996 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 77,191కు పెరిగింది.