న్యూఢిల్లీ : అస్సాంలో వరుస భూకంపాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బుధవారం సాయంత్రం 7 గంటల 22 నిమిషాల సమయంలో తేజ్పూర్కు దక్షిణంగా భూప్రకంనలు చోటు చేసుకున్నాయి.
రిక్టర్ స్కేల్పై ప్రకంపనల తీవ్రత 3.5గా నమోదైంది. 27 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నిక్షిప్తమై ఉన్నట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది.
గత సోమవారం (ఈ నెల 3న) సైతం అస్సాంలోని సోనిత్పూర్లో భూప్రకంనలు చోటు చేసుకున్నాయి.. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.7గా నమోదైంది. అస్సాంలో ఇప్పటివరకు వరుసగా 7 సార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.