హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో బరిలోకి దిగుతున్న ప్లేయర్లను రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ సన్మానించారు. బుధవారం స్థానిక గచ్చిబౌలి స్టేడియం లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రితో పాటు జాతీయ హ్యాండ్బాల్ ఫెడరేషన్(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు, జాతీ య బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, క్రీడాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈనెల 23 నుంచి మొదలవుతున్న టోక్యో విశ్వక్రీడల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పీవీ సింధు, సాయి ప్రణీత్, సాత్విక్సాయిరాజ్ను మంత్రి శ్రీనివాస్గౌడ్ సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘టోక్యోలో అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలతో రాష్ర్టానికి మరిన్ని పేరు, ప్రఖ్యాతలు తీసుకురావాలి’ అని అన్నారు. గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా స్టార్ షట్లర్ సింధు.. స్టేడియం ఆవరణలో మొక్కనాటింది. టోక్యోలో పాల్గొంటున్న అథ్లెట్లకు దేశమంతా మద్దతు తెలపాలని జగన్మోహన్రావు పిలుపునిచ్చారు.