లేహ్ : లడఖ్లోని కార్గిల్లో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.2 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. కార్గిల్కు 184 కిలోమీటర్ల దూరంలో, భూమికి 140 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. హిమాలయ ప్రాంతంలో భూకంపాలు వచ్చే అవకాశం ఉందని, ప్రస్తుత ప్రకంపనలతో ఎలాంటి నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు.