మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 29 : నిరుపేదల సంజీవని సీఎం సహాయ నిధి అని ఎంపీపీ పద్మా జగన్రెడ్డి, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్రెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయలో మున్సిపాలిటీ చైర్పర్సన్ లక్ష్మీరెడ్డి, కండ్లకోయకు చెందిన రేణుకకు రూ. 60వేలు, ఎంపీపీ పద్మారెడ్డి కండ్లకోయ పరిధిలోని తన స్వగృహంలో పూడూరు గ్రామానికి చెందిన శ్రీలక్ష్మీకి చెందిన రూ. 50వేలు సీఎం సహాయ నిధి చెక్కులను వేర్వేరుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీదైన వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎం సహా య నిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎంతో మంది తమ ప్రాణాలను కాపాడుకోగలుగుతున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పని చేస్తున్న సీఎం కేసీఆర్ సారధ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా సీఎం సహాయనిధి కింద కోట్లాది రూపాయలను పేదలకు మంజూరు చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్లు దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్, బేరి బాలరాజు, టీఆర్ఎస్ మున్సిపాలిటీ గౌరవ అధ్యక్షుడు కందాడి నరేందర్రెడ్డి, రాజేందర్ ముదిరాజ్, సర్పంచ్ ఈటబోయిన బాబుయాదవ్ పాల్గొన్నారు.
కీసర : పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని చీర్యాల్ గ్రామానికి చెందిన బానుచారీ నిమ్స్లో చికిత్స పొందుతూ ఆరోగ్యంగా తిరిగొచ్చాడు. ఆయనకు లక్ష రూపాయలు, అనిల్యాదవ్కు రూ. 60,000వేలు గురువారం మంత్రి నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో పేద ప్రజల సంక్షేమం కోసం పూర్తి భరోసానిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, చీర్యాల్, కీసర సర్పంచ్ తుంగ ధర్మేందర్, నాయకపు మాధురి వెంకటేశ్, చీర్యాల్ మాజీ ఉప సర్పంచ్ రమేశ్తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.