శ్రీశైలం : కొవిడ్ విజృంభణ నేపథ్యంలో శ్రీశైల క్షేత్రంలో హైఅలర్ట్ ప్రకటించామని ఈఓ కేఎస్
రామారావు తెలిపారు. క్షేత్ర దర్శనార్థం వచ్చే భక్తులు అడుగడుగునా కొవిడ్ నిబంధనలు పాటించేలా చూస్తున్నామని పేర్కొన్నారు.
దేవస్థానం సిబ్బంది భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసి స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పిస్తున్నారు.
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు భక్తులకు ఆలయ ప్రవేశం ఉంటుంది.
మధ్యాహ్నం నుంచి వర్తక వ్యాపారాలను పూర్తిగా మూసివేయాలని దేవస్థానం రెవెన్యూ విభాగం అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఆదేశాలను పాటించని వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచించారు.
అత్యవసరమైన మందుల దుకాణాలు మినహా ఇతర వ్యాపారాలేవీ నిర్వహించకూడదని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి