సిరిసిల్ల, జూన్ 24: సీఎం కేసీఆర్కు మానేరు రైతాంగం తరఫున మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎగువ మానేరు ప్రాజెక్ట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా వర్షాకాలం పంటలకు నీరు విడుదల చేస్తున్న సందర్భంగా సిరిసిల్ల రైతాంగం తరఫున బుధవారం రాత్రి ఈ కృతజ్ఞతా పూర్వకమైన ట్వీట్ పెట్టారు. తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ జలాలతో నర్మాల వద్ద గల ఎగువమానేరు వేసవికాలంలోనే నిండిందని, 2.2 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం గల ప్రాజెక్ట్ ప్రస్తుతం నిండుకుండలా కనిపిస్తున్నదని పేర్కొన్నారు.