న్యూఢిల్లీ: ఈశాన్య భారతంలో మరోమారు భూపంకం సంభవించింది. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో స్వల్పంగా భూమి కంపించింది. 20 నిమిషాల వ్యవధిలో రెండు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. మణిపూర్లోని శిరుయ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున 1.22 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) ప్రకటించింది. అదేవిధంగా అరుణాచల్ప్రదేశ్లోని పాంగిన్లో 3.1 తీవ్రతతో భూమి కంపించిందని పేర్కొంది. అర్థరాత్రి 1.02 గంటల ప్రాంతంలో భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి నష్టంకానీ, ప్రాణనష్టం కానీ జరగలేదని ఎన్సీఎస్ వెల్లడించింది.