మేడ్చల్, మార్చి 24: దేశానికి స్వాతంత్యం వచ్చి 75 ఏండ్లు నిండిన సందర్భంగా ప్రధాని మోడీ పిలుపు మేరకు చేపడుతున్న స్వతంత్ర భారత అమృత మహోత్సవంలో భాగంగా బుధవారం నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఫ్రీడం రన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడ్చల్ మున్సిపాలిటీలో మున్సిపల్ కార్యాలయం నుంచి స్థానిక వివేకానంద విగ్రహం వరకు రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
కీసర, మార్చి 24: భారతదేశం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా ఉండి భిన్నత్వంలో ఏకత్వంగా నిలిచి విరిజిల్లుతుందని జిల్లా అదనపు కలెక్టర్ విద్యాసాగర్ అన్నారు. బుధవారం కీసర ఆర్డీవో కార్యాలయం నుంచి కీసరలోని అమరవీరుల స్తూపం వరకు ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ విద్యాసాగర్ ప్రారంభించారు. మార్చి 11వ తేదీ నుంచి వచ్చే నవంబర్ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్, డీఆర్వో లింగ్యానాయక్, జిల్లా క్రీడల శాఖ అధికారి , ఏవో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు రవి, మల్లయ్య, కీసర సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేశ్, జిల్లా అధికారులు, విద్యార్థులు కీసరకు చెందిన పలువురు యువకులు తదితరులు పాల్గొన్నారు.
జవహర్నగర్ కార్పొరేషన్లో..
జవహర్నగర్, మార్చి 24: జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ సిబ్బంది ఫ్రీడం రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమలో బిల్ కలెక్టర్లు, కార్పొరేషన్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
తూంకుంట మున్సిపాలిటీలో..
శామీర్పేట, మార్చి 24 : తూంకుంట మున్సిపాలిటీలో మున్సిపల్ కార్యాలయం నుంచి హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ వరకు రెండు కిలోమీటర్ల మేర ఫ్రీడం రన్ నిర్వహించి మువ్వన్నెల బెలూన్స్ను ఎగురవేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ వాణి వీరారెడ్డి, కమిషనర్ గంగాధర్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లకు అడుగు పెడుతున్న సందర్భంగా స్వతంత్య్ర భారత అమృత మహోత్సవాల్లో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పాండు, రాజ్కుమార్యాదవ్, సురేశ్, హరిబాబు, మేనేజర్ శ్రావణ్కుమార్, పర్యావరణ సూపర్వైజర్ గణేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో..
మేడ్చల్ కలెక్టరేట్, మార్చి 24 : నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో ఫ్రీడం రన్ నిర్వహించగా, నాగారంలో ఎక్కువసంఖ్యలో పిల్లలు పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా స్వతంత్ర భారత అమృతోత్సవాలు (అజాద్ కా అమృత్ మహోత్సవ్) నిర్వహిస్తున్నామని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్ కమిషనర్లు ఎ.వాణిరెడ్డి, స్వామి, కౌన్సిలర్లు, అధికారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.
ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీల్లో..
ఘట్కేసర్, మార్చి24: ఘట్కేసర్లో చైర్పర్సన్ ముల్లి పావనీ జంగయ్యయాదవ్ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట జెండా ఊపి ఫ్రీడం రన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో చైర్మన్ కొండల్రెడ్డి, వైస్చైర్మన్లు రెడ్డ్యానాయక్, మాధవరెడ్డి ప్రారంభించారు. కౌన్సిలర్లు, మున్సిపాలిటీ కమిషనర్లు వసంత, సురేశ్కుమార్, మేనేజర్లు నర్సింహులు, శ్రీధర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
గుండ్లపోచంపల్లిలో..
మేడ్చల్ రూరల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో ఫ్రీడం ఫర్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కమిషనర్ అమరేందర్రెడ్డి, సిబ్బంది, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.