న్యూఢిల్లీ: ఇవాళ పాస్పోర్ట్ సేవా దివస్. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో పాస్పోర్ట్ సేవల్లో తమశాఖ ఉద్యోగులు అత్యున్నత ప్రమాణాలు పాటించినట్లు ఆయన తెలిపారు. పౌరులకు నిర్దిష్ట కాలపరిమితిలోపే పాస్పోర్ట్లు అందజేసిన సిబ్బందిని ఆయన మెచ్చుకున్నారు. మహమ్మారికి ముందు ఎలా ఉండేదో.. త్వరలో అలాంటి స్థితికి చేరుకోనున్నట్లు ఆయన చెప్పారు. పాస్పోర్ట్ సర్వీస్ ప్రోగ్రామ్లో భాగంగా 174 భారతీయ ఎంబసీలను, కాన్సులేట్లను ఏకీకృతం చేసినట్లు ఆయన తెలిపారు. పాస్పార్ట్ జారీ విధానాలను సరళతరం చేశామని, ఇంకా మరింత సులువుగా పాస్పోర్ట్ జారీ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. కోవిడ్తో జరిగిన పోరాటంలో కొందరు పాస్పోర్ట్ కార్యాలయ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన వెల్లడించారు. వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. అస్వస్థతకు గురై మళ్లీ విధుల్లో చేరిన ఉద్యోగుల స్పూర్తిని ఆయన ప్రశంసించారు.