చండీఘఢ్ : కర్నాల్లో నిరసనలకు దిగిన రైతులపై పోలీసుల లాఠీచార్జిని హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా సమర్ధించారు. “మీపై దాడికి ప్రయత్నించే వారికి మీరు పూలదండలతో స్వాగతం పలకర”ని పాలక బీజేపీ సంకీర్ణ సర్కార్ భాగస్వామ్య పక్షమైన జేజేపీ నేత చౌతాలా వ్యాఖ్యానించారు. శాంతిభద్రతలను కాపాడేందుకే పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జి చేశారని చెప్పారు.
పోలీసులపై దాడికి దిగిన వీడియోలు బయటకు వచ్చాయని, శాంతిభద్రతలు కాపాడేందుకే పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చిందని పోలీసుల చర్యను చౌతాలా సమర్ధించారు. గత తొమ్మిది నెలలుగా తాము ఎన్నడూ రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించలేదని అన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల సుదీర్ఘ ఆందోళనలపై స్పందిస్తూ వారు రైతులు, వ్యవసాయ చట్టాల కోసం పనిచేస్తుంటే చర్చలకు రావాలని పేర్కొన్నారు.