బెంగళూరు: కర్ణాటకకు చెందిన ప్రముఖ రచయిత, సంపాదకుడు, నిఘంటుకర్త అయిన జి వెంకటసుబ్బయ్య (107) కన్నుమూశారు. కర్ణాటకకు చెందిన సమాచార, ప్రజాసంబంధాల విభాగం ఈ విషయాన్ని వెల్లడించింది. కన్నడ సాహిత్య రంగంలో వెంకటసుబ్బయ్య విశేష సేవలు అందించారు. ఆయన తన జీవితకాలంలో 12 డిక్షనరీలను సంకలనం చేశారు.
కన్నడ సాహిత్య రంగంపై వెంకటసుబ్బయ్య తనదైన ముద్ర వేశారు. కన్నడ వ్యాకరణకర్తగా, పద్య రచయితగా, అనువాదకుడిగా, వ్యాసకర్తగా విభిన్న సేవలు అందించారు. కన్నడ సాహిత్యరంగంలో ఆయన అందించిన సేవలకుగాను పద్మశ్రీ పురస్కారంతోపాటు పంప అవార్డు, సాహిత్య అకాడమీ నుంచి భాషా సమ్మాన్ అవార్డు, కర్ణాటక రాజ్యోత్సవ అవార్డు, కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డు తదితర పురస్కారాలు అందుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
బద్రీనాథ్ ఆలయంపై మల్లెలు చల్లినట్లుగా మంచు వర్షం.. వీడియో
కమలా హారిస్ను చంపేస్తామని బెదిరింపులు.. నర్సు అరెస్ట్
ప్రముఖ సాహితీవేత్త నరేంద్ర కోహ్లీ కన్నుమూత.. ప్రధాని సంతాపం
మార్కెట్లో కొనితెచ్చిన పాలకూరలో పాముపిల్ల.. వీడియో
వీళ్లు కేరళ జాతిరత్నాలు.. వీళ్ల నటన అమోఘం.. వీడియో