న్యూఢిల్లీ: బలహీనపడిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తర, ఈశాన్య ప్రాంతంలోని కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్తోపాటు నాలుగు ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయా, అరుణాచల్ప్రదేశ్, సిక్కింలలో జూలై 5 వరకు వానలు పడుతాయని ఐఎండీ వెల్లడించింది. పై ఆరు రాష్ట్రాల్లో వరదలు పోటెత్తే అవకాశం కూడా ఉన్నదని ఐఎండీ సీనియర్ సైంటిస్టు ఆర్కే జనమని చెప్పారు.