హైదరాబాద్ : ఆమెను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. పెళ్లి చేసుకుందామనుకున్నాడు. కానీ ఆ పని జరగలేదు. అతని ప్రియురాలికి మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది. బాధను భరించలేక ప్రియురాలికి కాబోయేవాడిని ఆమె ప్రియుడు కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన పాతబస్తీలోని మైలార్దేవ్పల్లి శాస్ర్తిపురం కింగ్స్ కాలనీలో చోటు చేసుకుంది.
నదీమ్ అనే యువకుడికి ఇటీవలే ఓ అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. అయితే ఆ అమ్మాయిని మరో అబ్బాయి ప్రేమించాడు. కానీ అతనితో కాకుండా నదీమ్తో ఆమెకు నిశ్చితార్థం జరిపించారు. దీంతో చేసేదేమీ లేక నదీమ్ను ఆమె ప్రియుడు కిడ్నాప్ చేశాడు. బైక్పై వెళ్తున్న నదీమ్ను కారులోకి లాక్కెళ్లి పారిపోయారు దుండగులు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ కిడ్నాప్ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.