న్యూఢిల్లీ, మార్చి 25: ఉష్ణోగ్రతలు ఏడాదికి ఒక డిగ్రీ సెల్సియస్ పెరిగితే పరిశ్రమల్లో ఉత్పాదక స్థాయిలు రెండు శాతం పడిపోతాయని తాజా అధ్యయనం తెలిపింది. వాతావరణ మార్పుల వల్ల పెరిగే వేడితో కార్మికులపై ఒత్తిడి తీవ్రమై.. భారత్లో తయారీ రంగం దెబ్బతింటున్నదని పేర్కొంది. ఈ అధ్యయనాన్ని షికాగో యూనివర్సిటీలోని ‘ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్’ నిర్వహించింది. భారత్లోని 58 వేల ఫ్యాక్టరీల సమాచారంతో పాటు పలు అంశాలను పూర్తిస్థాయిలో విశ్లేషించింది.