న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో దశ ఆందోళన రేపుతున్నది. శనివారం రికార్డు స్థాయిలో 24,375 కరోనా కేసులు, 167 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,27,998కు, మరణాల సంఖ్య 11,960కు పెరిగింది. యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 69,799కు చేరింది. దీంతో ఢిల్లీలోని ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో మరోసారి కరోనా వైద్య కేంద్రాన్ని డీఆర్డీవో ఏర్పాటు చేసింది. అన్ని బెడ్లకు ఆక్సిజన్, వెంటిలేటర్ సదుపాయాలు ఉన్నట్లు తెలిపింది. వైద్య సదుపాయాలన్నీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలమేరకు ఉన్నాయని, చికిత్సకు ఎలాంటి చార్జీలు ఉండవని డీఆర్డీవో అధికారులు తెలిపారు. న్యూరో, కార్డియాక్ కేసుల రోగులను ఎయిమ్స్కు రిఫర్ చేస్తామని వెల్లడించారు.