రాంచీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్కు దాదాపు రెండు సంవత్సరాలపాటు ట్రీట్మెంట్ చేసిన వైద్యుడు ఉమేశ్ ప్రసాద్ ( RIMS doctor ) ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా మల్టిపుల్ మైలోమా వ్యాధితో బాధపడుతున్న ఉమేశ్.. పరిస్థితి చేయిదాటడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ మల్టిపుల్ మైలోమా అనేది ఒక రకం బ్లడ్ క్యాన్సర్ అని వైద్యులు తెలిపారు.
మల్టిపుల్ మైలోమా వ్యాధి కారణంగా డాక్టర్ ఉమేశ్ ప్రసాద్ వీల్చైర్కే పరిమితమయ్యారు. అదే పరిస్థితిలో ఆస్పత్రికి వస్తూ వైద్య సేవలు కూడా అందించారు. జార్ఖండ్లోని రిమ్స్ ఆస్పత్రి మెడిసిన్ విభాగం హెచ్ఓడీగా బాధ్యతలు నిర్వహించే డాక్టర్ ఉమేశ్ ప్రసాద్.. ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్ సుదీర్ఘ కాలం ట్రీట్మెంట్ చేశారు. కాగా, డాక్టర్ ఉమేశ్ మృతికి బీహార్ ఆరోగ్యశాఖ మంత్రి బన్నా గుప్త సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.