లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున ఘజియాబాద్లోని మురికివాడలో ఉన్న ఓ గుడిసెలో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి సమీపంలోని నివాసాలకు వ్యాపించాయి. దీంతో డజనుకుపైగా గుడిసెలు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు ఫైర్ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..