కొట్టక్కల్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆయుర్వేద వైద్యుడు, ఆర్యవైద్యశాల మేనేజింగ్ ట్రస్టీ, మాజీ చీఫ్ ఫిజీషియన్ పీకే వారియర్ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 100 ఏళ్లు. జూన్ 8వ తేదీనే ఆయన నూరవ పుట్టిన రోజు జరుపుకున్నారు. గత ఆరు దశాబ్ధాల నుంచి ఆర్యవైద్యశాల పురోగతి కోసం శ్రమించారు. కొట్టక్కల్ ఆయుర్వేద కళాశాలకు ఆయన మారుపేరుగా నిలిచారు. విభిన్న తరహా వ్యాధులకు ఆయన ఆయుర్వేదం చికిత్స అందించారు. ఆయుర్వేద చికిత్స గురించి అనేక వ్యాసాలు రాశారు. పాదముద్రకల్ పేరుతో ఆయన ప్రసంగాలు, వ్యాసాలను ప్రచురించారు. కచ్చితమైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఆయన ప్రత్యేక ల్యాబ్ను ఏర్పాటు చేశారు. ఆ ల్యాబ్ ఇప్పుడు సెంటర్ ఫర్ మెడిసినల్ ప్లాంట్స్ రీసర్చ్ సెంటర్గా మారింది. 2008లో స్మృతి పర్వం రచన చేసిన ఆయనకు కేరళ సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ఎథినోఫార్మాలజీ, ఆయుర్వేదంపై ఆయన అనేక పరిశోధనా పత్రాలను సమర్పించారు.