రాంచీ : జార్ఖండ్లోని సింఘ్భూమ్ జిల్లా మనోహర్పూర్ బ్లాక్కు చెందిన మారుమూల గ్రామ నివాసి గుల్షన్ లోహ్రా. బాధ్యయుత పౌరుడు ఎలా ఉండాలో ఉదాహరణగా నిలిచాడు. రెండు చేతులను కోల్పోయిన ఇతడు సమాజానికి పెద్ద సందేశమే ఇచ్చాడు. వివిధ కారణాలతో కొవిడ్ వ్యాక్సినేషన్కు కొంతమంది దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
అయితే గుల్షన్ లోహ్రా మాత్రం తనకు రెండు చేతులు లేనప్పటికీ తన తొడపై వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఏదేమైనా కరోనాను దూరంగా ఉంచేందుకు, వైరస్ నుంచి తనను తాను రక్షించుకునేందుకు వ్యాక్సిన్ తీసుకున్నట్లు గుల్షన్ తెలిపాడు. వ్యాక్సినేషన్ అనంతరం తనకు ఎటువంటి సమస్యలు ఎదురుకాలేదని.. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా కోరాడు.
కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే మరణం సంభవించడం, జ్వరం, నపుంసకత్వం వంటి భయాలతో గుమ్లా, ఖుంటి, సిమ్దేగా, వెస్ట్ సింఘ్భుం, ఇతర గిరిజన జిల్లాల ప్రజలు వ్యాక్సినేషన్ తీసుకునేందుకు భయపడుతున్నారు. కాగా లోమ్రా తన చర్య ద్వారా ఇటువంటి వారికి పెద్ద సందేశమే ఇచ్చినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు. ఆరోగ్యకరమైన ఓ వ్యక్తికి వ్యాక్సిన్ అతని ఎడమ చేతికి ఇవ్వబడుతుంది. కాగా లోహ్రాకు డబుల్ యాంప్యూటీ ఉన్నందున అతని ఎడమ తొడలో కొవిడ్-19 వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు మనోహర్పూర్ మెడికల్ ఆఫీసర్ నరేంద్ర సుంబ్రాయ్ చెప్పారు.