పంచాయతీ కార్యదర్శులు పనులను పర్యవేక్షించాలి : జిల్లా పరిషత్ సీఈవో జ్యోతి
బాలానగర్, జూన్ 4 : లాక్డౌన్ ఉన్నా కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో పనులకు మినహాయింపు ఇచ్చిందని, కరోనా పేరుతో ఉపాధి పనులు ఆపొద్దని జెడ్పీ సీఈవో జ్యోతి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధతో ఉపాధి హామీ పనులను పర్యవేక్షించాలని, వారికి అన్ని వసతులు కల్పించాలన్నారు. ఇందుకు జాబ్కార్డు ఉన్న వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఉపాధిహామీ పనులను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ చేయించాలన్నారు. అలాగే వైకుంఠధామం పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం వాటరింగ్ డే సందర్భంగా హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీళ్లు పో శారు. సమావేశంలో ఎంపీడీవో కృష్ణారావు, ఏపీవో రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది ఉన్నారు.
అవగాహన కల్పించాలి
రాజాపూర్, జూన్ 4 : మండలంలోని అన్ని గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్పై ప్రజలకు అవగాహన కల్పించాలని జెడ్పీ సీఈవో జ్యోతి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రా మాల్లో ఉపాధిహామీ ద్వారా కూలీలకు పను లు కల్పించాలన్నారు. గ్రామ సభ ఏర్పాటు చేసి ఉపాధి పనులపై ప్రజలకు వివరించాలన్నారు. కూలీ పనుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని కార్యదర్శులకు సూచించారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పనిచేయకుంటే షోకాజ్ నోటీసులు అందించాలని ఎంపీడీవో లక్ష్మీదేవిని ఆదేశించారు. సమావేశంలో ఎంపీడీవో లక్ష్మీదేవి, వెంకట్రాములు, ఉపాధిహామీ సిబ్బంది తదితరులు ఉన్నారు.